40% పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య

  • పీఆర్సీపై చర్చలకు అవకాశం
           పీఆర్సీ అమలుపై చర్చించేందుకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను వచ్చేవారం చర్చలకు పిలిచే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి తెలిపారు.

 పీఆర్సీ అమలుపై అభిప్రాయాలు తెలు సుకునేందుకు శనివారం విజయవాడ ఆర్టీసీ భవన్ సమాఖ్యకు అనుబంధంగా ఉన్న 92 సంఘాలతో సమావేశం నిర్వహించారు. 

      ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్సీ అమలుపై ఈ నెల 25న గౌ౹౹ సీఎం గారిని  కలిసినప్పుడు వారం పది రోజుల్లో మొత్తం పీఆర్సీ ప్రక్రియను పూర్తి చేస్తా మని చెప్పినట్టు తెలిపారు.

     వచ్చే వారం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచే అవకాశం ఉందన్నారు. 40 శాతం ఫిట్మెంట్తో 11వ పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరు తూ తీర్మానం చేశారు. 2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయాలని, 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలని ప్రభు త్వాన్ని కోరుతున్నట్టు వెంకట్రామిరెడ్డి తెలి పారు. 

రెగ్యులర్ ఉద్యోగులతో పాటే యూనివర్సిటీ, కార్పొరేషన్, మోడల్ స్కూల్స్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద రికీ ఒకేసారి పీఆర్సీ అమలు చేయా లని కోరుతున్నట్టు తెలిపారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top