Jagananna Smart Towns: జనవరి 13న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లోని ఎంఐజీ లే అవుట్‌ ప్రారంభం

 గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సమీపంలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లోని ఎంఐజీ లే అవుట్‌ను ఈ నెల 13న సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.ఈ విషయాన్ని ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ విజయకృష్ణన్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 200 నుంచి 240 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ ప్లాట్లను పొందేందుకు రూ.18 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న ఏపీకి చెందిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

       కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తొలి దశలో 5 ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధికి నిర్ణయించారు. ప్రతి జిల్లాకో లేఅవుట్‌ విధిగా ఉండాలన్న ప్రభుత్వ తాజా ఆదేశాలతో మిగిలిన జిల్లాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్‌ భూముల సేకరణకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రైవేటు భూములను ప్రభుత్వ ధరకంటే 5 రెట్ల విలువకు మించకుండా సేకరించనున్నారు. అసైన్డ్‌ భూములను రైతులు, ప్రజల నుంచి భూసమీకరణ పథకం (ఎల్‌పీఎస్‌) కింద తీసుకోనున్నారు.  150, 200, 240 చ.గజాల్లో మూడు కేటగిరీల కింద ప్లాట్లను తయారుచేసి విక్రయిస్తారు.

Jagananna Smart Town Registration Link


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top