కరోనా విధ్వంసం కారణంగా, తమిళనాడులోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొన్ని తరగతులను మూసివేసింది.ఇతర తరగతులు, కళాశాల విద్యార్థులకు మార్గదర్శకాలు కూడా సవరించారు. పెరుగుతున్న కరోనా.. ఒమిక్రాన్ కేసుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. తమిళనాడులో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 10, 2022 వరకు మూసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే, 9వ తరగతి నుంచి కళాశాల వరకు విద్యార్థులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు
వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు..
అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేని వ్యక్తులు ఇన్ఫెక్షన్కు గురవుతున్నందున తమిళనాడులో కోవిడ్ కేసులు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కొత్త ఆంక్షల ప్రకారం, 9 నుంచి 12 తరగతుల పాఠశాలలు COVID-19 భద్రతా ప్రోటోకాల్లను అనుసరించి పనిచేస్తాయి. దీనితో పాటు, తమిళనాడులోని కళాశాలలు కూడా COVID తగిన ప్రవర్తనతో ఆఫ్లైన్ తరగతులను కొనసాగించాలని సూచించారు. నివేదికల ప్రకారం, తమిళనాడులోని పాఠశాలలు సెలవుల అనంతరం మొదట జనవరి 3, 2022 నుంచి తిరిగి తెరవాల్సి ఉంది.


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment