ఉగాది తర్వాత ఒంటిపూట బడులు!

 


రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్‌ను ప్రాథమిక విద్య డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌ ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ప్రభుత్వం ఓకే చెబితే ఉదయం 7.45 గంటల నుంచి 11.30 గంటల వరకు పాఠశాలలు జరుగుతాయి. దీనిపై విద్యాశాఖ మంత్రి శుక్రవారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. శనివారం ఉగాది పండుగ, ఆ మరుసటి రోజు ఆదివారం కాబట్టి సోమవారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కావొచ్చు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top