AP సచివాలయం వద్ద CPS ఉద్యోగుల నిరసన


 AP సచివాలయం వద్ద CPS ఉద్యోగుల నిరసన

ఏపీ సచివాలయం రెండో బ్లాక్ ఎదుట సీపీఎస్ ఉద్యోగులు మంగళవారం నిరసనకు దిగారు. 

ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం జరిగే బ్లాక్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్‌తో ఎర్ర గులాబీలు, ప్లేకార్డులతో నిరసన తెలిపారు. 

మంత్రుల కమిటీ సమావేశానికి వెళ్తున్న సూర్యనారాయణ, బొప్పరాజు, బండి శ్రీనివాస్‌లను అడ్డుకున్న ఉద్యోగులు వారికి ఎర్రగులాబీలు ఇచ్చి నిరసన తెలియజేశారు. 

ఉద్యోగ సంఘాలు తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, సీఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

సీపీఎస్ ఉద్యోగ సంఘాలను కూడా మంత్రుల కమిటీ చర్చలకు పిలవాలని ఉద్యోగులు కోరారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top