ఏపీలో రేపటి ఇంటర్ పరీక్షలు వాయిదా

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షలు అర్ధాంతరంగా వాయిదా పడ్డాయి . తుపాను వల్ల పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను ఈ నెల 25 న నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ' అసని ' దిశ మార్చుకుంది. ఉత్తర కోస్తా- ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను.. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రలోగా మచిలీపట్నం సమీపంలో తుపాను తీరం దాటే సూచనలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top