NEP ప్రకారమే టీచర్ల రేషనలైజేషన్, బదిలీలు

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)కి అనుగుణంగా ప్రభుత్వమిచ్చిన జీవో నం.117 ప్రకారం టీచర్ల రేషనలైజేషన్, బదిలీలు జరుగుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ శుక్రవారం తెలిపారు. సంబంధిత ఉత్తర్వుల ప్రకారం కేటగిరీ వారీగా ఎన్ని పోస్టు లు అదనంగా అవసరం ఉంటుందో వాటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించనున్నట్లు చెప్పారు. కొన్ని మాధ్యమాల్లో ప్రచురించిన రీతిగా జరగడం సత్యదూరమన్నారు. బదిలీలు ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు..

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top