AP Cabinet ముగిసిన క్యాబినెట్ సమావేశం తీసుకున్న కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో జరిగిన ఈ భేటీలో మంత్రుల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాల ఖరారుకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీని మంత్రివర్గం నియమించింది. వ్యవసాయ మంత్రి అచ్చం నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. రెండు రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కమిటీకి కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా? లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్ని ఖరారు చేయాలని సూచించింది. రెండు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని నిర్ణయాలు ఇవే..

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కెబినెట్ ఆమోదం.

కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం.

కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనున్న ప్రభుత్వం.

పౌర సరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం.

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top